రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
- March 30, 2025
న్యూ ఢిల్లీ: పవిత్ర రంజాన్ నెల నేటితో ముగియనుంది. 1446 షవ్వాల్ నెలకు నెలవంక దేశంలో కనిపించిందని సౌదీ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో అరబ్ దేశమైన సౌదీలో అదివారమే ఈద్ ఉల్ ఫితర్ మొదటి రోజును పాటిస్తుంది. అక్కడ రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నేటి ఉదయం ప్రారంభ మయ్యాయి.సౌదీ అరేబియాలో ఈద్ చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత అంటే రేపు ఈద్ పండుగ జరుపుకుంటారు.
భారతదేశంలో పవిత్ర రంజాన్ మాసం మార్చి 2న ప్రారంభం అయ్యింది. అంటే ఈద్ ఉల్ ఫితర్ మార్చి 31 లేదా ఏప్రిల్ 1న వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో, ఈద్ చంద్రుడు కనిపించినప్పుడు మాత్రమే ఈద్ నిర్ణీత తేదీని పరిగణిస్తారు.. నిన్న సౌదీ లో నెల వంక కనిపించడం తో రేపు భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ జరపాలని మత పెద్దలు నిర్ణయించారు.ఆ రోజున, ఈద్గాలో ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్