ఏపీలో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం..
- April 04, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం అందుబాటులోకి వచ్చింది. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెలాఖరులోగా దశలవారీగా మిగిలిన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇదో కీలక ఘట్టం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో రిజిస్ట్రేషన్ శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అనేక మందితో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
10 నిమిషాల వ్యవధిలో అమ్మకం, కొనుగోలు, సాక్షులు పని పూర్తిచేసుకొని వెళ్లే విధంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. 26 జిల్లాల్లో 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ మొదలవుతుందని అన్నారు. ఇక మీదట రోజుల తరబడి వేచిచూసే ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. భూ వివాదాలు లేకుండా, సంస్కరణలు తీసుకొస్తున్నామని, అభివృద్ధికోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నామని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్







