ఏపీలో ‘స్లాట్ బుకింగ్’ విధానం ప్రారంభం..
- April 04, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ విధానం అందుబాటులోకి వచ్చింది. తొలి విడతలో భాగంగా 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెలాఖరులోగా దశలవారీగా మిగిలిన కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇదో కీలక ఘట్టం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో రిజిస్ట్రేషన్ శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అనేక మందితో చర్చించి అభిప్రాయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.
10 నిమిషాల వ్యవధిలో అమ్మకం, కొనుగోలు, సాక్షులు పని పూర్తిచేసుకొని వెళ్లే విధంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. 26 జిల్లాల్లో 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ మొదలవుతుందని అన్నారు. ఇక మీదట రోజుల తరబడి వేచిచూసే ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ఇలాంటి కొత్త సంస్కరణల వల్ల అవినీతికి తావుండదని పేర్కొన్నారు. భూ వివాదాలు లేకుండా, సంస్కరణలు తీసుకొస్తున్నామని, అభివృద్ధికోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానం తెస్తున్నామని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక







