వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ

- April 11, 2025 , by Maagulf
వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ

వారణాసి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి (కాశీ)లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాశీవాసుల ప్రేమకు రుణపడి ఉన్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత 10 సంవత్సరాలలో బనారస్ అభివృద్ధి కొత్త ఊపు వచ్చిందన్నారు.నేడు కాశీ పురాతనమైనది కాదు, అది ప్రగతిశీలమైనది కూడా. కాశీ పూర్వాంచల అభివృద్ధి రథాన్ని లాగుతోందన్నారు. వారణాసికి 3880 కోట్ల రూపాయల బహుమతి ఇచ్చారు.ఆయన వారణాసిలో రోడ్లు, విద్యుత్, విద్య, పర్యాటక రంగానికి సంబంధించిన 44 ప్రాజెక్టులను ప్రారంభించారు, మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు.

ఆర్థిక కేంద్రం

కాశీ ఇప్పుడు పురాతనమైనది మాత్రమే కాదు, ప్రగతిశీలమైనదని ప్రధాని మోదీ అన్నారు. ‘‘కాశీ ప్రేమకు రుణపడి ఉన్నాను. ఇప్పుడు కాశీ పూర్వాంచల్ ఆర్థిక కేంద్రంగా అవతరించింది. కాశీ ఆధునిక కాలాన్ని వారసత్వంతో సమతుల్యం చేసిందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కాశీ పూర్వాంచల అభివృద్ధి రథాన్ని స్యయం ఆ మహాశివుడే లాగుతున్నారన్నారు. పూర్వాంచల్‌లో సౌకర్యాలు విస్తరిస్తున్నాయి. భారతదేశ వైవిధ్యానికి కాశీ అత్యంత అందమైన చిత్రం. మా దృష్టిలో దేశ సేవ అనే మంత్రం – సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్అని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి ప్రాంతానికి, కుటుంబానికి, యువతకు మెరుగైన సౌకర్యాలను అందించాలని,ఈ పథకాలన్నీ పూర్వాంచల్‌ను అభివృద్ధి చేసే దిశలో మైలురాళ్ళుగా మారబోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

బలమైన చర్యలు

కాశీలోని ప్రతి నివాసి ఈ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతారని,దీనికి కాశీ వాసులతో పాటు పూర్వాంచల్‌లకు అభినందనలు’ అని ప్రధానమంత్రి అన్నారు.సామాజిక సంక్షేమం కోసం మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవితాంతం కృషి చేశారు.ఈ రోజు మనం ఆయన తీర్మానాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కాశీ ఆధునిక యుగాన్ని స్వీకరించిందని, వారసత్వాన్ని పరిరక్షించిందని, భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే దిశగా బలమైన చర్యలు తీసుకుందని ప్రధాని మోదీ అన్నారు. నేడు కాశీకి ఎవరు వెళ్ళినా అక్కడి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను ప్రశంసిస్తున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది బనారస్‌కు వస్తారు, స్వామి విశ్వనాథ్‌ను సందర్శించి, గంగా నదిలో స్నానం చేస్తారు. ప్రతి ప్రయాణికుడు అంటారు, బనారస్ చాలా మారిపోయింది అని ప్రధాని మోదీ తెలిపారు. కాశీలోని ప్రతి ప్రాంతంలోనూ ఒక విభిన్న సంస్కృతి కనిపిస్తుంది,నేడు భారతదేశం అభివృద్ధి, వారసత్వం రెండింటినీ కలిపి ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అనే మంత్రాన్ని సాకారం చేసుకునే దిశలో పశుసంవర్ధక కుటుంబాలకు, ముఖ్యంగా కష్టపడి పనిచేసే మన సోదరీమణులకు ప్రత్యేక అభినందనలు అని ప్రధాని మోదీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com