మనామాలో కమ్యూనిటీ ఈవెంట్ హాల్ ఏర్పాటు.. ప్రతిపాదనకు పార్లమెంటు ఆమోదం..!!
- April 17, 2025
మనామా: తక్కువ ఆదాయ కుటుంబాలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో రాజధాని గవర్నరేట్లోని మొదటి నియోజకవర్గంలో ఉన్న హూరాలో కమ్యూనిటీ ఈవెంట్ హాల్ను ఏర్పాటు చేయాలన్న ఎంపీ మొహమ్మద్ హుస్సేన్ జనహి ప్రతిపాదనను ప్రతినిధుల మండలి ఆమోదించింది. పార్లమెంటరీ సమావేశంలో ఎంపీ జనహి అనేక కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సవాళ్లను హైలైట్ చేశారు. కమ్యూనిటీ ఈవెంట్ హాల్ను వల్ల ఈవెంట్లను నిర్వహించడం వల్ల కలిగే ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. "చాలా కుటుంబాలు ప్రైవేట్ హాళ్లను అద్దెకు తీసుకోలేకపోతున్నాయి. దీనికి తరచుగా వందలాది దినార్లు ఖర్చవుతాయి" అని ఆయన అన్నారు. ప్రతిపాదిత ఈవెంట్ హాల్ రాజధాని గవర్నరేట్లోని మొదటి నియోజకవర్గ నివాసితులకు వివాహాలు, అంత్యక్రియలు, ఇతర కమ్యూనిటీ సమావేశాలను నిర్వహించడానికి ఒక ప్రత్యేక స్థలాన్ని అందిస్తుందని, తద్వారా ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు తోటి సభ్యుల నుండి మద్దతు లభించడంతో ఆమోదం లభించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









