బహ్రెయిన్ కింగ్ యొక్క రాయల్ పార్డన్
- July 08, 2016
పాకిస్తానీ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, 559 మంది ఖైదీలకు రాయల్ పార్డన్ లభించినట్లు వెల్లడించింది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా వీరికి క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందినవారిలో 82 మంది పాకిస్తానీయులు ఉన్నారు. 69 మంది భారతీయులకు క్షమాభిక్ష లభించింది. పాకిస్తానీ అంబాసిడర్ జావెద్ మాలిక్ వ్యక్తిగతంగా పాకిస్తానీ ఖైదీలను మే 2016లో పరామర్శించి, వారికి క్షమాభిక్ష ఇవ్వాల్సిందిగా కింగ్ హమాద్కి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇంకో వైపున, భారతదేశ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, 69 మంది భారత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినందుకుగాను బహ్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్ష పొందినవారు సత్ప్రవర్తనతో వ్యవహరించాల్సిందిగా మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







