ఖతార్ లో 2025 గ్లోబల్ సెక్యూరిటీ ఫోరమ్‌ ప్రారంభం..!!

- April 29, 2025 , by Maagulf
ఖతార్ లో 2025 గ్లోబల్ సెక్యూరిటీ ఫోరమ్‌ ప్రారంభం..!!

దోహా, ఖతార్: ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్-థాని సోమవారం ఏడవ ప్రపంచ భద్రతా వేదికను ప్రారంభించారు. "ప్రపంచ భద్రతపై రాష్ట్రేతర సంస్థల ప్రభావం" అనే థీమ్‌తో జరిగే ఈ వేదిక ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. తన ప్రసంగంలో ప్రపంచ భద్రతా వేదిక అసాధారణ ప్రాముఖ్యతను తెలిపారు. ఉక్రెయిన్ నుండి గాజా వరకు విస్తరించి ఉన్న సంక్షోభాలను ఆయన తన వ్యాఖ్యలలో హైలైట్ చేశారు. ఖతార్ రాష్ట్రం ఎల్లప్పుడూ వివాదాలను పరిష్కరించడానికి, శాంతిని నిర్మించడానికి ప్రాథమిక మార్గంగా దౌత్య సూత్రానికి కట్టుబడి ఉందన్నారు. 

గ్లోబల్ సెక్యూరిటీ ఫోరంలో వివిధ దేశాల మంత్రులు, భద్రతా సంస్థల అధిపతులు, నిపుణులు, విద్యావేత్తలు, జర్నలిస్టులతో సహా కీలకమైన అంతర్జాతీయ అధికారులు పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com