ఈ నెల 30నే శ్రీవారి సేవ ఆన్లైన్ కోటా విడుదల..
- April 29, 2025
తిరుమల: తిరుపతి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? శ్రీవారి సేవ జూన్ నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ 30న విడుదల చేయనుంది. శ్రీవారి సేవ నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్త సేవను అమల్లోకి తీసుకొస్తోంది.ఇందు కోసం శ్రీ సత్యసాయి సేవా సంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్ (కోయంబత్తూర్), ఆర్ట్ ఆఫ్ లివింగ్ (బెంగళూరు) వంటి ఆధ్యాత్మిక సంస్థలను టీటీడీ అధికారులు సందర్శించి అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనంలో భాగంగా శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువచ్చింది. కొత్తగా రూపొందించిన అప్లికేషన్ ద్వారా ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి.
శ్రీవారి సేవ (తిరుమల, తిరుపతి) జనరల్ కోటాను ఉదయం 11 గంటలకు, పరకామణి సేవ (పురుషులకు మాత్రమే) మధ్యాహ్నం ఒంటి గంటకు, నవనీత సేవ (మహిళలకు మాత్రమే) మధ్యాహ్నం 12 గంటలకు, గ్రూప్ లీడర్ సేవ (కొత్త సేవ) మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది.
గ్రూప్ లీడర్లు ఈ సేవకు 45 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండాలి. అప్పుడు తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు.15 రోజులు, నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేసేందుకు ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
శ్రీవారి సేవకులుగా పనిని పర్యవేక్షించడం, సేవకు వచ్చిన సేవకుల వివరాలు తీసుకోవడం, ప్రతి సేవకుని పనితీరును మూల్యాంకనం చేయడం బాధ్యతలు ఉంటాయి. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆన్లైన్ పరకామణి సేవను బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









