బహ్రెయిన్ లో కార్మికులను సత్కరించిన క్యాపిటల్ గవర్నర్..!!

- May 01, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో కార్మికులను సత్కరించిన క్యాపిటల్ గవర్నర్..!!

మానామా: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యుత్తమ సేవలను అందించిన కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాపిటల్ గవర్నర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ రషీద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. కార్మికులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సేవలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక బంధాలను పెంపొందించడానికి, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు.  గవర్నరేట్ ఉద్యోగుల అంకితభావం, అర్థవంతమైన సహకారాలకు గుర్తింపుగా వారికి మెమోంటోలు అందజేశారు. డిప్యూటీ క్యాపిటల్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా బహ్రెయిన్ నిరంతర అభివృద్ధికి కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని హెచ్ఈ షేక్ రషీద్ ప్రశంసించారు.    


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com