ఆపరేషన్ సిందూర్.. అనేక విమానాశ్రయాలు మూసివేత, విమానాలు రద్దు..!!
- May 07, 2025
కువైట్: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో విమాన కార్యకలాపాలు ఇరు దేశాలు నిలిపివేశారు. దీని వలన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ధర్మశాల (DHM), లేహ్ (IXL), జమ్మూ (IXJ), శ్రీనగర్ (SXR), అమృత్సర్ (ATQ) వంటి కీలక విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను భారత్ నిలిపివేసింది. ప్రయాణీకులు విమానయాన సంస్థలతో తమ విమానాల స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు.
భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమృత్సర్కు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి మళ్లించారు. ఎయిర్ఫీల్డ్ మూసివేయబడినందున ఈరోజు శ్రీనగర్ విమానాశ్రయం నుండి ఎటువంటి పౌర విమానాలు నడపబడవని అధికారులు తెలిపారు.
ఇటీవల ఖతార్ కూడా పాకిస్థాన్ కు తమ సర్వీసులను రద్దు చేసింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణీకులు, సిబ్బంది భద్రత తమ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని ఎయిర్లైన్ తెలిపింది. బాధిత ప్రయాణీకులు qatarairways.com లో రియల్-టైమ్ అప్డేట్లను తనిఖీ చేయాలని లేదా +974 4144 5555 నంబర్లో ఎయిర్లైన్ సపోర్ట్ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి