ఇక పై భారత్ మరింత చేరువకానుంది
- July 13, 2015
శబ్ధవేగం కంటే మిన్నగా ప్రయాణం చేసే విమానం వచ్చేస్తోంది. గంటంటే గంటలో దుబాయ్ నుంచి భారత్కు చేర్చేస్తామని విమాన తయారీదారులు ధీమాగా చెబుతున్నారు.. ఎమిటి ఆ సంస్థ.. ? ఎప్పుడు వస్తుంది ఆ విమానం..? బోస్టన్లోని స్పైక్ ఏరోస్పేస్ కంపెనీ చెబుతోంది. ఈ దిశగా 'ఎస్-512' పేరిట ఓ సూపర్సోనిక్ (శబ్దంకన్నా వేగం) విమానాన్ని ఆ సంస్థ తయారు చేస్తోంది. గంటకు 2,200 కిలోమీటర్లవేగంతో ప్రయాణించే ఈవిమానం లండన్- న్యూయార్క్ల మధ్య 7గంటల ప్రయాణాన్ని 3 గం టలకు తగ్గించేస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దుబాయ్ నుంచి కేవలం గంటలో ఇండియాలో ల్యాండయిపోతామట. దీన్ని రూపుదిద్దుతున్న ఇంజనీర్ల బృందంలో భారత సంతతి సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. దీనికి అమర్చబోయే 'డెల్టా' రెక్కలవల్ల ఇంతటి వేగం సాధ్యమని వారు వివరించారు. ఈ విమానం తయారీకి రూ.380 కోట్ల నుంచి 506 కోట్ల మధ్య ఖర్చవుతుందని సంస్థ సీఈవో విక్ కచోరియా తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







