విషాదం.. 24 ఏళ్ల యూఏఈ జాతీయ ఆర్చర్, అతని సోదరుడు మృతి..!!
- May 10, 2025
యూఏఈ: షార్జాలోని అల్ మడమ్లో మంగళవారం రాత్రి జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదంలో 24 ఏళ్ల ఎమిరాటీ జాతీయ జట్టు ఆర్చర్, అతని 14 ఏళ్ల సోదరుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో వేగంగా రైడింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
షార్జా పోలీసుల ప్రకారం.. ఫిలి ప్రాంతంలోని అల్ మడమ్ రోడ్లో అన్నయ్య నడుపుతున్న మోటార్ సైకిల్ మితిమీరిన వేగం కారణంగా బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తమ్ముడు సంఘటనా స్థలంలోనే మరణించగా, అన్నయ్యను అల్ ధైద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు.
రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ ఆపరేషన్స్ రూమ్ కు ప్రమాదం గురించి సమాచారం అందిందని, పోలీస్ పెట్రోలింగ్ జాతీయ అంబులెన్స్ యూనిట్లతో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి త్వరగా చేరుకున్నాయని, కానీ చిన్న బాధితుడిని రక్షించడానికి చాలా ఆలస్యమైందని తెలిపారు.
సోదరుల కోసం అంత్యక్రియల ప్రార్థనలు ఫిలి మసీదులో జరిగాయి. ఇద్దరు సోదరులను ఫిలి స్మశానవాటికలో ఖననం చేశారు. ఈ సందర్బంగా షార్జా పోలీసులు మరోసారి నివాసితులు ట్రాఫిక్ చట్టాలను పాటించాలని, ముఖ్యంగా మోటార్ సైకిళ్లపై వేగంగా నడపవద్దని కోరారు. హెల్మెట్లు ధరించడం, రక్షణ గేర్లను ఉపయోగించడం ప్రాముఖ్యతను, అలాగే తగిన ప్రాంతాల్లో లైసెన్స్ పొందిన వ్యక్తులు మాత్రమే మోటార్ సైకిళ్లను నడుపుతున్నారని నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







