భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణను స్వాగతించిన సౌదీ అరేబియా..!!

- May 11, 2025 , by Maagulf
భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణను స్వాగతించిన సౌదీ అరేబియా..!!

రియాద్: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా స్వాగతించింది. ఈ నిర్ణయం శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందం రెండు దేశాలకు, వారి ప్రజలకు దీర్ఘకాలిక భద్రత, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగిన రోజుల తర్వాత కాల్పుల విరమణ మంచి పరిణామమని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌లతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com