భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- September 14, 2025
యూఏఈ: ఆసియా కప్లో భాగంగా నేడు(సెప్టెంబర్ 14న) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. దీనికి హాజరయ్యే అభిమానులకు దుబాయ్ పోలీసులు పలు సూచనలు చేశారు. క్రికెట్ అభిమానులు వేదిక వద్దకు తీసుకెళ్లడానికి అనుమతించని వస్తువుల జాబితాను వెల్లడించారు. యూఏఈ కాలమానం ప్రకారం.. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్కు 3 గంటల ముందు స్టేడియం గేట్లు ఓపెన్ అవుతాయని పోలీసులు తెలియజేశారు. లోపలికి ప్రవేశించాలనుకునే వారు చెల్లుబాటు అయ్యే టికెట్ను చూపించాలని సూచించారు.
అభిమానులు తమ కార్లను పార్కింగ్ చేయడానికి ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభిమానులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని , నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. మైదానంలో వస్తువులను విసిరే లేదా మ్యాచు సమయంలో జాత్యహంకార భాషను ఉపయేగిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. రూల్స్ పాటించిన వారికి మూడు నెలల వరకు జైలు శిక్ష, Dh30,000 వరకు జరిమానా విధించబడుతుందని దుబాయ్ పోలీస్ ఆపరేషన్స్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మరియు దుబాయ్లోని ఈవెంట్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ మేజర్ జనరల్ సైఫ్ మహర్ అల్ మజ్రౌయి హెచ్చరించారు.
మ్యాచు సందర్భంగా క్రికెట్ అభిమానులు రిమోట్-ఎలక్ట్రానిక్ పరికరాలు, పెంపుడు జంతువులు, చట్టవిరుద్ధమైన లేదా విషపూరిత పదార్థాలు, పవర్ బ్యాంకులు, ఫైర్ వర్క్స్, లేజర్ పాయింటర్లు, గ్లాస్ వస్తువులు, సెల్ఫీ స్టిక్స్, మోనోపాడ్లు, అంబ్రెల్లాలు, పదునైన వస్తువులు, సిగరేట్లు, ఔట్ సైడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్, జెండాలు లేదా బ్యానర్లు వంటి వాటిని తీసుకు రావడాన్ని నిషేధించారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









