32 దెబ్బతిన్న జెట్ స్కీలు సీజ్.. అద్దె కంపెనీలకు హెచ్చరికలు జారీ..!!
- May 11, 2025
యూఏఈ: దుబాయ్ పోలీసులు ఇటీవల నిర్వహించిన తనిఖీలలో తీవ్రంగా దెబ్బతిన్న లేదా గతంలో ప్రమాదాలకు గురైన 32 జెట్ స్కీలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆపరేషన్కు పనికిరానివిగా మారాయని పేర్కొన్నారు.
దుబాయ్ ఫిషింగ్ పోర్ట్ 3లో పనిచేస్తున్న జెట్ స్కీ అద్దె కంపెనీలను లక్ష్యంగా క్షేత్ర తనిఖీలు చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర భద్రతను పెంచడానికి, సముద్ర వాహన అద్దె రంగాన్ని నియంత్రించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో ఈ తనిఖీలు భాగమి ప్రకటించారు.
లైసెన్స్ లేని మెరైన్ వాహనాన్ని లేదా ఎమిరేట్ జలాల్లో నడపడానికి అధికారం లేని వాహనాన్ని నడిపినందుకు జరిమానా కింద Dh5,000 అని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత మెరైన్ వాహనాన్ని ఉపయోగించి దానిని పునరుద్ధరించకపోతే Dh1,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. పనికిరాని మెరైన్ వాహనాలను అద్దెకు ఇచ్చే కంపెనీలపై Dh5,000 జరిమానా విధిస్తామని, అదే సమయంలో ఇన్స్పెక్టర్లు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం లేదా నిరోధించడం చేస్తే Dh5,000 జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
జెట్ స్కీ అద్దె కార్యాలయాలు జెట్ స్కీలు, మెరైన్ పరికరాల పరిస్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అద్దెకు ముందు.. తరువాత భద్రత, భద్రతా చర్యలను తనిఖీలు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!