తెలంగాణ: గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ తో సీఎం రేవంత్​ భేటీ..

- May 12, 2025 , by Maagulf
తెలంగాణ: గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ తో సీఎం రేవంత్​ భేటీ..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఇవాళ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులు, తెలంగాణలో భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.

అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పెండింగ్ పడుతూ వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగానూ ఉత్కంఠగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com