వరుసగా ఐదో సారి లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపీ బాలశౌరి
- May 15, 2025
న్యూ ఢిల్లీ: గత ప్రభుత్వ హయంలో నాలుగు సంవత్సరాలు లోక్ సభ సభార్దినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా పదవీ భాద్యతలు నిర్వహించిన మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి, కూటమి ప్రభుత్వంలో మరోసారి కూడా చైర్మన్ పదవి వరించింది.లోక్ సభ సభార్దినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంతో సమర్ధవంతంగా పదవి బాధ్యతలు నిర్వహించి, అటు ఉన్నతాధికారులతోనూ, ఇటు కేంద్రం ప్రభుత్వంలోని పెద్దలతోను సత్సంభందాలు నెలకొల్పడంలో చూపించిన చాకచక్యం వారికీ మరోసారి ఈ చైర్మన్ పదవి దక్కేటట్లు చేసింది.గతంలో లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా చాలా తక్కువ సమయంలో ఎక్కువ సమావేశాలు నిర్వహించిన ఘనత కూడా ఎంపీ బాలశౌరి ఖాతాలో ఉండటం గమనార్హం.
గత పదవీ కాలంలో 38 రకాల వివిధ సంస్థలతో సుమారుగా 80 పైగా సమావేశాలను నిర్వహించి వారి సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఎంతో ఓర్పుతో, నేర్పుతో, కమిటీలో అందరి సభ్యుల సహకారం తీసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలతో ఎన్నో సమావేశాలు నిర్వహించి, అక్కడి సమస్యలను కూలంకషంగా అర్ధం చేసుకొని, తగిన పరిష్కార మార్గాలు వెదకడంలో ఎంతో ప్రతిభ కనపరచడం వలననే, మరొకమారు కూటమి ప్రభుత్వంలో అదే అధ్యక్ష పదవి వరించడం జరిగింది.
మూడుసార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికైన ఎంపీ బాలశౌరి యొక్క సేవలను గుర్తించిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లోక సభ ఫ్లోర్ లీడర్ గా నియమించడమే కాకుండా, ఇంకోసారి లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు, ఇందుకు సహకారం అందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కు, కూటమి పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.
ఈ పదవీకాలంలో కుడా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైనమేర శక్తివంచన లేకుండా పాటుపడతానని, కమిటీలోని అందరు గౌరవ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని, వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని లోక్ సభ సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!