స్లీపర్ బస్సులో మంటలు–ఐదుగురు సజీవదహనం

- May 15, 2025 , by Maagulf
స్లీపర్ బస్సులో మంటలు–ఐదుగురు సజీవదహనం

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో కిసాన్‌పాత్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాయప్తు చేస్తున్నారు.

అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు రావడానికి కారణం ఏంటో ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్న సమాచారం. ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా.. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వేకువ జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com