గోదావరి పుష్కరాలు ప్రారంభం
- July 13, 2015
రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో చంద్రబాబు స్నానమాచరించారు. ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గోదావరి మహా పుష్కరాలు సాగనున్నాయి. టీటీడీ తరపున గోదావరికి చీర, సారెలను చంద్రబాబు సమర్పించారు. అనంతరం సీఎం బాబు పుష్కర ఘాట్లను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గోదావరిలో కేసీఆర్ పుష్కరస్నానం ఆచరించారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కొవ్వూరులో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పుష్కరస్నానం ఆచరించి పుష్కరాలను ఆరంభించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







