గోదావరి పుష్కరాలు ప్రారంభం
- July 13, 2015
రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో చంద్రబాబు స్నానమాచరించారు. ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గోదావరి మహా పుష్కరాలు సాగనున్నాయి. టీటీడీ తరపున గోదావరికి చీర, సారెలను చంద్రబాబు సమర్పించారు. అనంతరం సీఎం బాబు పుష్కర ఘాట్లను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గోదావరిలో కేసీఆర్ పుష్కరస్నానం ఆచరించారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కొవ్వూరులో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పుష్కరస్నానం ఆచరించి పుష్కరాలను ఆరంభించారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







