గోదావరి పుష్కరాలు ప్రారంభం

- July 13, 2015 , by Maagulf
గోదావరి పుష్కరాలు ప్రారంభం

రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్‌లో చంద్రబాబు స్నానమాచరించారు. ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గోదావరి మహా పుష్కరాలు సాగనున్నాయి. టీటీడీ తరపున గోదావరికి చీర, సారెలను చంద్రబాబు సమర్పించారు. అనంతరం సీఎం బాబు పుష్కర ఘాట్లను ప్రారంభించారు. కరీంనగర్‌ జిల్లా ధర్మపురిలో పుష్కరాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం గోదావరిలో కేసీఆర్‌ పుష్కరస్నానం ఆచరించారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కొవ్వూరులో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పుష్కరస్నానం ఆచరించి పుష్కరాలను ఆరంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com