బహ్రెయిన్ లో 167 మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- May 20, 2025
మనామా: మే 11 నుంచి 17 తేదీల మధ్య బహ్రెయిన్ అంతటా నిర్వహించిన తనిఖీల ఫలితాలను లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ (LMRA) ప్రకటించింది. 167 మంది ఉల్లంఘనకారులను బహిష్కరించినట్లు తెలిపింది. అదే సమయలో 14 మంది అక్రమంగా ఉంటున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నట్ల వెల్లడించింది. మొత్తంగా 1,337 తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నది. వీటిలో 1,324 వాణిజ్య సంస్థలకు వ్యక్తిగత సందర్శనలు, బహుళ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో 13 ఉమ్మడి తనిఖీ కార్యకలాపాలు ఉన్నాయి.
నాలుగు గవర్నరేట్లలో ఉమ్మడిగా ప్రచారాలు జరిగాయని, వీటిలో క్యాపిటల్ గవర్నరేట్లో ఏడు, ముహారఖ్, నార్తర్న్, సదరన్ గవర్నరేట్లలో రెండు చొప్పున తనిఖీలు ఉన్నాయి. జాతీయత, పాస్పోర్ట్లు, నివాస వ్యవహారాలు (NPRA) ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోలీసు డైరెక్టరేట్లు, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆయా మునిసిపాలిటీలతోపాటు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సిబ్బంది తనిఖీలలో పాల్గొన్నాయని వివరించారు.
ఏవైనా అనుమానిత కార్మిక ఉల్లంఘనలను LMRA వెబ్సైట్ www.lmra.gov.bh ద్వారా, 17506055 కు కాల్ చేయడం ద్వారా లేదా తవాసుల్ ద్వారా ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్