45 కిలోలు తగ్గి.. ప్రతి కిలోకు 300 దిర్హామ్ లు గెలుచుకున్న అమృత్ రాజ్..!!
- May 22, 2025
దుబాయ్: దుబాయ్ లో ఉండే భారతదేశానికి చెందిన అమృత్ రాజ్.. రస్ అల్ ఖైమా వెయిట్ లాస్ ఛాలెంజ్ 2025 విజేతగా నిలిచాడు. బహుమతిని గెలుచుకోవడానికి అతను ఏకంగా 45.7 కిలోల బరువు తగ్గాడు. దాంతో అతనికి 13,800 దిర్హామ్ లు బహుమతిగా లభించింది. మహిళా విభాగంలో పాకిస్తాన్ ప్రవాసురాలు స్పినా ఘటై మొహమ్మద్ యాకూబ్.. 25 కిలోల బరువు తగ్గి మహిళల ఛాంపియన్ గా నిలిచారు.
నిర్వాహకులు తెలిపిన ప్రకారం.. ఈ సంవత్సరం ఎడిషన్లో యూఏఈ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,289 మంది పాల్గొన్నారు.
"నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లావుగా ఉండేవాడిని. నాకు 100 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నట్లు గుర్తు లేదు. నేను అధిక బరువుతో ఉన్నప్పుడు కూడా ఆమె నన్ను వివాహం చేసుకోవాలని ఎంచుకుంది. కాబట్టి ఈ ప్రయాణం నా భార్యకు అంకితం." అని అమృత్ రాజ్ తెలిపాడు. బరువు తగ్గడం అనేది మనసుకు, దృష్టికి సంబంధించినది అని ఆయన అన్నారు. మీ మనస్సులో ఒక లక్ష్యం ఉండి, దృష్టి కేంద్రీకరించినట్లయితే, మీరు దానిని చేరుకుంటారని తెలిపారు.
RAK బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ 2025లో ఫ్యామిలీ కేటగిరీలో నియాజ్ హంజా పరప్పలత్, అతని కుటుంబం రన్నరప్గా నిలిచింది.
RAK హాస్పిటల్ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MOHAP) రస అల్ ఖైమా సహకారంతో ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ ను నిర్వహిస్తారు. అవార్డుల ప్రదానోత్సవంలో MSF ప్రతినిధి కార్యాలయం డైరెక్టర్ ఖలీద్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ షెహి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







