స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

- July 11, 2016 , by Maagulf
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సోమవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. రూ. 150 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ. 30,850కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,365.41 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.
వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ. 430 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 46,730కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com