వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు.. ఒత్తిడికి గురికావొద్దు: సౌదీ హెల్త్ మినిస్ట్రీ
- June 04, 2025
రియాద్: వార్షిక హజ్ యాత్ర ప్రారంభానికి గుర్తుగా యాత్రికులు మినాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. యాత్రికుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసకోవాలని సూచించింది. వేసవి సమయంలో అనారోగ్యాలను నివారించడానికి గొడుగులు ఉపయోగించాలని, దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు త్రాగాలని, లేత రంగు, తేలికైన దుస్తులు ధరించాలని యాత్రికులకు సూచించింది.
అధిక వేడికి గురైతే(సన్ స్ట్రోక్) లక్షణాలు అయిన తలనొప్పి, తల తిరగడం, అధిక చెమట, దాహం, వికారం వంటి ఉంటాయని, అవి కనిపంచగానే వెంటనే వైద్య బృందాలను సంప్రదించాలని కోరారు. యాత్రికులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యక్ష సూర్యకాంతికి గురికాకుండా ఉండాలని, వేడి ఉపరితలాలపై నడవకుండా ఉండాలని, పర్వతాలను ఎక్కడం వంటి కఠినమైన కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పవిత్ర స్థలాలలో వ్యూహాత్మకంగా 34 కి పైగా ఫీల్డ్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!