మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన విమానం
- June 12, 2025
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. గురువారం (జూన్ 12న) మధ్యాహ్నం 1.38 గంటల సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది.టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో హాస్టల్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బ్రిటిష్ జాతీయులు
ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలుపుకొని మొత్తం 242 మంది ఉన్నట్లు ఎయిరిండియా(Air India) ధ్రువీకరించింది. విమానంలో ఉన్నవారిలో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటిష్ జాతీయులు, పోర్చుగీస్కు చెందిన ఏడుగురు, కెనడాకు చెందిన ఒకరు ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్స్కు తరలించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్