నిర్మాణ స్థలాలను తనిఖీ చేసిన మోహ్రే..!!
- June 14, 2025
యూఏఈః యూఏఈలో జూన్ 15 నుండి కార్మికులకు వేసవి మధ్యాహ్న విరామం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మొహ్రే) నిర్మాణ స్థలాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ నిబంధన ప్రకారం, సెప్టెంబర్ 15 వరకు కార్మికులు నేరుగా ఎండలో మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయడంపై నిషేధం విధించారు.వేసవిలో కార్మికుల ఆరోగ్యం, వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించే లక్ష్యంతో మధ్యాహ్న విరామ నిబంధనను అమలు చేస్తున్నట్లు మోహ్రే మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ తెలిపారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి Dh5,000 జరిమానా విధించబడుతుందని, గరిష్టంగా Dh50,000 వరకు ఫైన్ ఉంటుందని తెలిపారు. ఏవైనా ఉల్లంఘనలను 600590000 నంబర్లో మోహ్రే కాల్ సెంటర్కు తెలపాలని సూచించారు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







