నిర్మాణ స్థలాలను తనిఖీ చేసిన మోహ్రే..!!
- June 14, 2025
యూఏఈః యూఏఈలో జూన్ 15 నుండి కార్మికులకు వేసవి మధ్యాహ్న విరామం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మొహ్రే) నిర్మాణ స్థలాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ నిబంధన ప్రకారం, సెప్టెంబర్ 15 వరకు కార్మికులు నేరుగా ఎండలో మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయడంపై నిషేధం విధించారు.వేసవిలో కార్మికుల ఆరోగ్యం, వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించే లక్ష్యంతో మధ్యాహ్న విరామ నిబంధనను అమలు చేస్తున్నట్లు మోహ్రే మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ తెలిపారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి Dh5,000 జరిమానా విధించబడుతుందని, గరిష్టంగా Dh50,000 వరకు ఫైన్ ఉంటుందని తెలిపారు. ఏవైనా ఉల్లంఘనలను 600590000 నంబర్లో మోహ్రే కాల్ సెంటర్కు తెలపాలని సూచించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







