నిర్మాణ స్థలాలను తనిఖీ చేసిన మోహ్రే..!!
- June 14, 2025
యూఏఈః యూఏఈలో జూన్ 15 నుండి కార్మికులకు వేసవి మధ్యాహ్న విరామం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మొహ్రే) నిర్మాణ స్థలాలను తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ నిబంధన ప్రకారం, సెప్టెంబర్ 15 వరకు కార్మికులు నేరుగా ఎండలో మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేయడంపై నిషేధం విధించారు.వేసవిలో కార్మికుల ఆరోగ్యం, వారికి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించే లక్ష్యంతో మధ్యాహ్న విరామ నిబంధనను అమలు చేస్తున్నట్లు మోహ్రే మంత్రి డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ తెలిపారు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన కంపెనీలకు ఒక్కో కార్మికుడికి Dh5,000 జరిమానా విధించబడుతుందని, గరిష్టంగా Dh50,000 వరకు ఫైన్ ఉంటుందని తెలిపారు. ఏవైనా ఉల్లంఘనలను 600590000 నంబర్లో మోహ్రే కాల్ సెంటర్కు తెలపాలని సూచించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









