కూంబింగ్ లో పేలిన ఐఈడి–ఎఎస్ఐ దుర్మరణం
- June 14, 2025
భువనేశ్వర్: ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు.అప్రమత్తమైన ఒడిశా పోలీసులు..ఐఈడీ (IED) పేలిన పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.మృతి చెందిన సీఆర్పీఎఫ్ ఆఫీసర్ను ఏఎస్ఐ సత్యబాన్ కుమార్ సింగ్(34)గా గుర్తించారు.తీవ్ర గాయాలపాలైన కుమార్ సింగ్ను రూర్కేలాలోని ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.కుమార్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా.రూర్కేలాలోని కే బాలంగ్ గ్రామ సమీపంలోని అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది.ఈ ఘటన శనివారం ఉదయం 6 గంటలకు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్