షుగర్ని తగ్గించే ఈ రొట్టెని ఈజీగా చేసుకోం
- June 16, 2025
రెగ్యులర్ చపాతీలకంటే జొన్న రొట్టెలు మంచివని అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల బరువు తగ్గడం నుంచి ఎన్నో లాభాలు ఉంటాయి.అయితే, నార్మల్ జొన్నరొట్టె కంటే మరింత టేస్టీగా ఉండేలా జొన్నరొట్టెను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.పెరిగిన అవగాహన కారణంగా ఎక్కువగా అన్నం బదులు చపాతీలనే తింటున్నారు.అది కూడా గోధుమ చపాతీల బదులు మరో అడుగు ముందుకేసి జొన్న రొట్టెల్ని తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
ఈ జొన్నరొట్టెలు తింటే బరువు తగ్గడం, షుగర్ తగ్గడం నుంచి జీర్ణక్రియ మెరుగ్గా మారి దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. దీనికి కారణం జొన్నల్లోని యాంటీ ఆక్సిడెంట్ ఫినోలిక్ గుణాలు. అయితే, నార్మల్ చపాతీలను చేయడమే కొందరికీ కష్టంగా ఉంటుంది. అలాంటి వారు జొన్న రొట్టెలు చేయొచ్చా, అది కూడా మసాలా జొన్నరొట్టెలా మా వల్ల కాదు అనుకోవదు. ఇవి చేయడం చాలా ఈజీ. పైగా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒక్కోసారి కూరలు లేకపోయినా తినేయొచ్చు. మరి కావాల్సిన పదార్థాలు, తయారుచేసే విధానమేంటో తెలుసుకోండి.
ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులో నీరు పోసి వేడి చేయండి.తర్వాత అందులో జీలకర్రని కాస్తా నలిపి వేయండి. నువ్వులు కూడా వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు కప్పు జొన్న పిండి వేయండి. అందులోనే తరిగిన కొత్తిమీర వేయండి. కొద్దిగా మిరియాల పొడి వేయండి. అన్నింటిని కలిపి మూతపెట్టి 5 నిమిషాలు ఉంచండి. తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని బాగా ఒత్తి చపాతీ పిండిలా చేయండి. ఇప్పుడు పైన కొద్దిగా నూనె వేసి అలానే ఉంచండి. 10 నిమిషాల తర్వాత పిండిని ముద్దల్లా చేయండి. పిండి ఆరిపోకుండా తడిగుడ్డతో కప్పండి. ఒక్కో పిండి ముద్దని తీసుకుని రోటీల్లా ఒత్తుకోండి. జొన్న రోటీలను పెనంపై వేసి రెండువైపులా కొద్దిగా కాల్చి నేరుగా మంటపై కాల్చండి. దీంతో చక్కగా పొంగుతాయి. వీటిని తీసి వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా నెయ్యి రాయండి. ఇలా తయారైన చపాతీలను మీకు నచ్చిన కూరతో ఎంజాయ్ చేయొచ్చు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







