ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇస్లామిక్ నూతన సంవత్సర సెలవు ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
- June 16, 2025
అబుదాబి: యూఏఈ ప్రభుత్వం ఇస్లామిక్ నూతన సంవత్సరం (హిజ్రీ సంవత్సరం 1447) సందర్భంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జూన్ 27 (శుక్రవారం) వేతనాలతో కూడిన సెలవు ప్రకటించింది.
శనివారం సెలవు ఉండే కొందరు ఉద్యోగులకు జూన్ 27 నుంచి జూన్ 29 వరకు మొత్తం 3 రోజుల పాటు సెలవు కలుగనుందని అధికారులు తెలిపారు. జూన్ 30 (సోమవారం) నుంచి సాధారణ పనులు పునఃప్రారంభం అవుతాయి.
ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుందని అధికారులు స్పష్టం చేశారు. ఏకరీతి సెలవు విధానం కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసే ప్రతి ఒక్కరు సమానంగా సెలవు పొందుతారు.
జూన్ ప్రారంభంలో ఈద్ అల్ అద్హా సందర్భంగా చేసిన విస్తృత సెలవులకు తోడుగా ఇప్పుడు హిజ్రీ నూతన సంవత్సరాన్ని జరుపుకునే అవకాశం కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం
- దుబాయ్ లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్..వాహనం సీజ్..!!
- ఇబ్రి గవర్నరేట్లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణాపాయం..!!
- భవనాల సబ్ డివజన్ కి SR25వేల గరిష్ట జరిమానా..!!
- హైదరాబాద్ లో భారీగా గోల్డ్ బార్స్ స్వాధీనం..!!
- ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- ఖతార్ లో పుంజుకున్న రెసిడెన్షియల్ రెంటల్ మార్కెట్..!!
- తిరుమల లడ్డూ ధర పెంపు వార్తలు అవాస్తవం: బీఆర్ నాయుడు