2028 నుండి ఒమన్ లో 5% ఆదాయపు పన్ను..!!
- June 23, 2025
ఒమన్: 2028 నుండి ఒమన్ వార్షిక ఆదాయం 42,000 ఒమన్ రియాల్స్ (సుమారుగా దిర్హామ్లు 400,000) కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులపై ఐదు శాతం ఆదాయపు పన్ను విధించనుంది. రాయల్ డిక్రీ నంబర్ 56/2025 జారీ చేసిన వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఆదాయపు పన్నును ప్రవేశపెట్టే లక్ష్యం ప్రభుత్వ ఆదాయ వనరులను వైవిధ్యపరచడం, చమురు ఆదాయాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ ప్రాంతంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును ప్రవేశపెట్టిన మొదటి గల్ఫ్ సహకార మండలి (GCC) దేశంగా సుల్తానేట్ అవతరించనుంది. యూఏఈ, ఇతర గల్ఫ్ దేశాలు విలువ ఆధారిత పన్ను (VAT), కార్పొరేట్ ఆదాయపు పన్నును ప్రవేశపెట్టాయి. దాంతోపాటు నివాసితులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి యూఏఈ పొగాకు, కార్బోనేటేడ్ పానీయాలపై కూడా పన్ను విధించింది. ఈ చట్టం 2028 ప్రారంభంలో అమల్లోకి వస్తుందని ఆదాయపు పన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ కరిమా ముబారక్ అల్ సాది తెలిపారు.
అయితే, కొన్ని మినహాయింపులు ప్రకటించారు. ఒమన్ సుల్తానేట్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, వారసత్వం, జకాత్, విరాళాలు, ప్రాథమిక గృహనిర్మాణం, ఇతర సామాజిక పరిగణనలకు సంబంధించిన తగ్గింపులు, మినహాయింపులను కూడా ఈ చట్టంలో ప్రకటించారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను అమలుకు ముందు సమగ్ర అధ్యయనం నిర్వహించామని, ఇది మినహాయింపు పరిమితిని జాగ్రత్తగా పరిగణించిందని, ఒమన్ జనాభాలో దాదాపు 99 శాతం మంది ఈ పన్ను పరిధిలోకి రారని వెల్లడైందని ఒమన్ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!