మిడిలీస్ట్ లో సైనిక ఉద్రిక్తతలు..ప్రజల భద్రతపై GCC ఆందోళన..!!
- June 23, 2025
కువైట్: మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు కొనసాగడం ఈ ప్రాంత ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఐక్యరాజ్యసమితిలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సంఘర్షణ విస్తరించకుండా నిరోధించడానికి, ఆయా దేశాలు సంయమనం పాటించాలని GCC దేశాలు పిలుపునిచ్చాయని ఐక్యరాజ్యసమితిలో కువైట్ శాశ్వత ప్రతినిధి తారెక్ అల్-బనై తెలిపారు. జిసిసి తరపున ఈ ప్రాంతంలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో అల్-బనై ప్రసంగించారు.
ఇరాన్లోని అణు స్థావరాలపై తాజా వైమానిక దాడులను GCC బృందం పర్యవేక్షిస్తుందన్నారు. అదే సమయంలో ఉద్రిక్తతలను ఆపేందుకు భద్రతా మండలి, అంతర్జాతీయ సమాజం తమ బాధ్యతను నిర్వర్తించాలని రాయబారి అల్-బనాయ్ కోరారు. ప్రస్తుత సంక్షోభాన్ని తగ్గించడానికి.. అందరి ప్రయోజనం కోసం భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు GCC దేశాలు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్