అబుదాబిలో పిల్లలతో సరదాగా గడిపిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 28, 2025
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తాను నిజంగా 'ప్రజల అధ్యక్షుడు' అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల అబుదాబిలో జరిగిన క్రీడా కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యక్తిత్వం మరోసారి చర్చకు వచ్చింది. షేక్ మొహమ్మద్ పిల్లలతో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పిల్లలు కూడా యూఏఈ ప్రెసిడెంట్ పై ముద్దుపెట్టి తమ ప్రేమను వ్యక్తం చేయడం గమనార్హం.
క్రీడా దుస్తులు ధరించిన పిల్లలు అబుదాబిలోని ADNEC సెంటర్లో ఏటా జరిగే మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఇండోర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్ (ADSS)లో పాల్గొంటున్నారు. ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పాడెల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడలకు సంబంధించిన ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. చిన్నారి అథ్లెట్లను ప్రోత్సహించడానికి స్వయంగా షేక్ మొహమ్మద్ తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవాసులతో మాట్లాడి, వారితో ఫోటోలకు పోజులిచ్చారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







