అబుదాబిలో పిల్లలతో సరదాగా గడిపిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 28, 2025
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తాను నిజంగా 'ప్రజల అధ్యక్షుడు' అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల అబుదాబిలో జరిగిన క్రీడా కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యక్తిత్వం మరోసారి చర్చకు వచ్చింది. షేక్ మొహమ్మద్ పిల్లలతో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పిల్లలు కూడా యూఏఈ ప్రెసిడెంట్ పై ముద్దుపెట్టి తమ ప్రేమను వ్యక్తం చేయడం గమనార్హం.
క్రీడా దుస్తులు ధరించిన పిల్లలు అబుదాబిలోని ADNEC సెంటర్లో ఏటా జరిగే మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఇండోర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్ (ADSS)లో పాల్గొంటున్నారు. ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పాడెల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడలకు సంబంధించిన ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. చిన్నారి అథ్లెట్లను ప్రోత్సహించడానికి స్వయంగా షేక్ మొహమ్మద్ తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవాసులతో మాట్లాడి, వారితో ఫోటోలకు పోజులిచ్చారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







