అబుదాబిలో పిల్లలతో సరదాగా గడిపిన యూఏఈ అధ్యక్షుడు..!!
- June 28, 2025
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తాను నిజంగా 'ప్రజల అధ్యక్షుడు' అని నిరూపించుకుంటున్నారు. ఇటీవల అబుదాబిలో జరిగిన క్రీడా కార్యక్రమం సందర్భంగా ఆయన వ్యక్తిత్వం మరోసారి చర్చకు వచ్చింది. షేక్ మొహమ్మద్ పిల్లలతో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పిల్లలు కూడా యూఏఈ ప్రెసిడెంట్ పై ముద్దుపెట్టి తమ ప్రేమను వ్యక్తం చేయడం గమనార్హం.
క్రీడా దుస్తులు ధరించిన పిల్లలు అబుదాబిలోని ADNEC సెంటర్లో ఏటా జరిగే మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద ఇండోర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన అబుదాబి సమ్మర్ స్పోర్ట్స్ (ADSS)లో పాల్గొంటున్నారు. ఫుట్బాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పాడెల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడలకు సంబంధించిన ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. చిన్నారి అథ్లెట్లను ప్రోత్సహించడానికి స్వయంగా షేక్ మొహమ్మద్ తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రవాసులతో మాట్లాడి, వారితో ఫోటోలకు పోజులిచ్చారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







