ఫుజైరాలో బీచ్కి వెళ్లేవారికి సేఫ్టీ టిప్స్..ప్రమాదాలపై ఆందోళన..!!
- July 05, 2025
యూఏఈ: ఫుజైరా రెస్క్యూ బృందాలు గత సంవత్సరం ఎమిరాటీలు, ప్రవాసులు సహా 26 మందిని మునిగిపోకుండా కాపాడాయి. అయినా, ఒకరు మరణించిన సంఘటన నమోదైంది. వేసవిలో బీచ్ కు వచ్చేవారితో తీరప్రాంతాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా అధికారులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. సముద్రంలో ఈత కొడుతూ మునిగిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లు, పడవ లాంటి రక్షణలు ఉన్న చోటనే సముద్రంలోకి దిగాలని సూచించారు.
ఈ సందర్భంగా కీలక భద్రతా మార్గదర్శకాలను జారీ చేశారు:
-బోటింగ్ చేసేటప్పుడు లేదా ఆఫ్షోర్లో ఈత కొట్టేటప్పుడు ఎల్లప్పుడూ లైఫ్ జాకెట్లు ధరించాలి.
-పర్యవేక్షణ లేని లేదా నిషేధించబడిన ప్రాంతాలకు దూరంగా ఉండండి.
-బయటకు వెళ్లే ముందు సముద్ర వాతావరణ అప్డేట్ లను తెలుసుకోవాలి.
- పిల్లలను నీటి దగ్గర ఎప్పుడూ పర్యవేక్షణ లేకుండా వదిలివేయవద్దు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్