సలాలాకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?
- July 12, 2025
యూఏఈః ఖరీఫ్ వర్షాలు ఒమన్లోని ధోఫర్ గవర్నరేట్ను పచ్చని స్వర్గధామంగా మార్చాయి. దీంతో వేలాది మంది యూఏఈ నివాసితులు విహారయాత్ర కోసం సలాలాకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ శుక్రవారం ఉదయం ధోఫర్లో జరిగిన విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో, ప్రయాణికులు రాకపోకలు సాగించే ముందు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ధోఫర్లో మూడు వాహనాలు ఢీకొని ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 11 మందిలో తొమ్మిది మంది ఎమిరాటీలు, వారిలో ఐదుగురు పిల్లలు ఉన్నారు.
ధోఫర్ను సమీపించగానే అకస్మాత్తుగా కొండలు, పొగమంచు, వర్షాలు పలుకరిస్తాయని, మొత్తం డ్రైవింగ్ స్టయిల్ మారిపోతుందని, కొన్ని సార్లు ఇది ప్రమాదకరంగా మారుతుందని సిలికాన్ ఒయాసిస్ నివాసి మరియు సాహసికుడు అబ్దుల్లా మస్రీ అన్నారు. తుర్మైత్ తర్వాత వాడి దవ్ఖా సమీపంలోని పర్వత రోడ్లలోకి ప్రవేశించగానే ప్రమాదకరమైన మలుపులు, నిటారుగా ఉన్న వాలులు, పొగమంచుతో డ్రైవింగ్ క్లిష్టంగా మారుతుందన్నారు.
నిపుణుల సూచనలు
ఆదరబాదరగా డ్రైవింగ్ చేయవద్దు. వేగాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. అవసరమైతే ప్రయాణాన్ని రెండు రోజులుగా విభజించుకోవాలి.క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత, ముఖ్యంగా పర్వతాలలో డ్రైవింగ్ కు దూరంగా ఉండాలి. ధోఫర్లోకి ప్రవేశించే ముందు, డ్రైవర్లు తమ వాహనాలు అద్భుతమైన స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోవాలి. టైర్లు మంచి గ్రిప్ కలిగి ఉండాలి. పొగమంచు కారణంగా దృశ్యమానత తరచుగా తగ్గుతుంది. ఫాగ్ లైట్లు ఉపయోగించాలి.
గ్రామీణ ప్రాంతాలలో ఆవులు, మేకలు, ఒంటెలు వంటి పశువులు ఊహించకుండా అడ్డు వస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మార్గంలో కొన్ని మలుపులు ఇరుకైనవి, షార్ప్ వంపులు ఉంటాయి. వేగ పరిమితి గంటకు 80 కి.మీ.కు అనుమతించినప్పటికీ వేగాన్ని తగ్గించడం చాలా అవసరం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









