మ్వాసలాత్ గ్రీన్ చొరవ..ప్రశంసలు కురిపిస్తున్న ప్రయాణికులు..!!
- July 14, 2025
మస్కట్: ముత్రా రూట్ నంబర్ నాలుగులో ప్రవేశపెట్టిన మ్వాసలాత్ ఎలక్ట్రిక్ బస్సు ప్రయోగం విజయవంతమైంది. పిల్లల నుండి వృద్ధుల వరకు ముత్రా కార్నిచ్కు ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తున్నారు. సాధారణ సమయంలో అన్ని ప్రయాణీకులు అల్ ఆలం ప్యాలెస్లో దిగుతారు. కానీ గ్రీన్ చొరవ సందర్భంగా దాదాపు అందరూ బోర్డింగ్ పాయింట్లో దిగి మ్వాసలాత్ చొరవను ప్రశసించారు. గురువారం నుండి ఆదివారం వరకు ఈ రూట్ లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇందుకు గాను ప్రయాణీకులకు గ్రీన్ టికెట్ అందజేశారు. సాధారణ బస్సులు ఎరుపు రంగులో ఉన్నప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ బస్సును ఆకుపచ్చ రంగులో పెయింట్ చేయించడంతో ఇది ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా గ్రీన్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్