ఇండియా-దుబాయ్ రూట్లో పలు ఫ్లైట్స్ ఆలస్యం, రద్దు..!!
- July 17, 2025
యూఏఈ: ఇండియా-దుబాయ్ రూట్లో పలు ఫ్లైట్స్ రద్దు ఆలస్యం, రద్దు సర్వసాధరంగా మారింది.బుధవారం కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయాలు కొనసాగాయి. దీనికారణంగా వందలాది మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారు.
లక్నో నుండి దుబాయ్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బుధవారం ఉదయం సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత రద్దు చేశారు.చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 8.45 గంటలకు బయలుదేరాల్సిన విమానం IX 193 160 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ను ప్రారంభించిన తర్వాత పైలట్ ఈ సమస్యను గమనించి వెంటనే ఎయిర్లైన్ అధికారులకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. "వారు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అది పరిష్కరించబడలేదు. విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది" అని తన కుటుంబంతో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు ఆర్. ఖాన్ అన్నారు. అయితే, కొంతమంది ప్రయాణీకులకు హోటళ్లలో వసతి కల్పించారని, మరికొందరికి తిరిగి చెల్లింపులు లేదా ప్రత్యామ్నాయ విమానాలలో సీట్లు హామీ ఇచ్చారని ఖాన్ తెలిపారు.
అలాగే, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ డిలే అయ్యింది. ఉదయం 9.30 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్కు వెళ్లే స్పైస్జెట్ విమానం SG 57 ఏడు గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరి చివరికి సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరింది. దుబాయ్ నుండి ఇన్బౌండ్ విమానం SG 58 ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యం జరిగిందని, అది షెడ్యూల్ కంటే దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని తెలిపారు. ప్రయాణికులు తొమ్మిది గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









