ఇండియా-దుబాయ్ రూట్లో పలు ఫ్లైట్స్ ఆలస్యం, రద్దు..!!
- July 17, 2025
యూఏఈ: ఇండియా-దుబాయ్ రూట్లో పలు ఫ్లైట్స్ రద్దు ఆలస్యం, రద్దు సర్వసాధరంగా మారింది.బుధవారం కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయాలు కొనసాగాయి. దీనికారణంగా వందలాది మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారు.
లక్నో నుండి దుబాయ్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బుధవారం ఉదయం సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత రద్దు చేశారు.చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 8.45 గంటలకు బయలుదేరాల్సిన విమానం IX 193 160 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ను ప్రారంభించిన తర్వాత పైలట్ ఈ సమస్యను గమనించి వెంటనే ఎయిర్లైన్ అధికారులకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. "వారు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అది పరిష్కరించబడలేదు. విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది" అని తన కుటుంబంతో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు ఆర్. ఖాన్ అన్నారు. అయితే, కొంతమంది ప్రయాణీకులకు హోటళ్లలో వసతి కల్పించారని, మరికొందరికి తిరిగి చెల్లింపులు లేదా ప్రత్యామ్నాయ విమానాలలో సీట్లు హామీ ఇచ్చారని ఖాన్ తెలిపారు.
అలాగే, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ డిలే అయ్యింది. ఉదయం 9.30 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్కు వెళ్లే స్పైస్జెట్ విమానం SG 57 ఏడు గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరి చివరికి సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరింది. దుబాయ్ నుండి ఇన్బౌండ్ విమానం SG 58 ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యం జరిగిందని, అది షెడ్యూల్ కంటే దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని తెలిపారు. ప్రయాణికులు తొమ్మిది గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









