ఇండియా-దుబాయ్ రూట్లో పలు ఫ్లైట్స్ ఆలస్యం, రద్దు..!!
- July 17, 2025
యూఏఈ: ఇండియా-దుబాయ్ రూట్లో పలు ఫ్లైట్స్ రద్దు ఆలస్యం, రద్దు సర్వసాధరంగా మారింది.బుధవారం కూడా పలు విమాన సర్వీసులకు అంతరాయాలు కొనసాగాయి. దీనికారణంగా వందలాది మంది ప్రయాణికులు ప్రభావితం అయ్యారు.
లక్నో నుండి దుబాయ్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం బుధవారం ఉదయం సాంకేతిక లోపం గుర్తించిన తర్వాత రద్దు చేశారు.చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఉదయం 8.45 గంటలకు బయలుదేరాల్సిన విమానం IX 193 160 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఇంజిన్ను ప్రారంభించిన తర్వాత పైలట్ ఈ సమస్యను గమనించి వెంటనే ఎయిర్లైన్ అధికారులకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించారు. "వారు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ అది పరిష్కరించబడలేదు. విమానయాన సంస్థ విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది" అని తన కుటుంబంతో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు ఆర్. ఖాన్ అన్నారు. అయితే, కొంతమంది ప్రయాణీకులకు హోటళ్లలో వసతి కల్పించారని, మరికొందరికి తిరిగి చెల్లింపులు లేదా ప్రత్యామ్నాయ విమానాలలో సీట్లు హామీ ఇచ్చారని ఖాన్ తెలిపారు.
అలాగే, జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ డిలే అయ్యింది. ఉదయం 9.30 గంటలకు బయలుదేరాల్సిన దుబాయ్కు వెళ్లే స్పైస్జెట్ విమానం SG 57 ఏడు గంటలకు పైగా ఆలస్యంగా బయలుదేరి చివరికి సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరింది. దుబాయ్ నుండి ఇన్బౌండ్ విమానం SG 58 ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యం జరిగిందని, అది షెడ్యూల్ కంటే దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని తెలిపారు. ప్రయాణికులు తొమ్మిది గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







