ముత్తన్న కాంప్లెక్స్ అద్దెదారులకు జూలై 30వరకు గడువు..!!
- July 19, 2025
కువైట్: ముత్తన్న కాంప్లెక్స్ నిర్వహణ సంస్థ పంపిన నోటీసు ప్రకారం..జూలై 30 నాటికి ముత్తన్న కాంప్లెక్స్లోని అందరూ టెనంట్స్ ఖాళీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. లీజుకు తీసుకున్న స్థలాలను అప్పగించాలని సూచించింది. అద్దెదారులు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు.
భాగస్వామ్య చట్టం ప్రకారం ముత్తన్న కాంప్లెక్స్ను బహిరంగ వేలం కోసం ఆమోదించిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల ఉన్నత కమిటీ నిర్ణయాన్ని అనుసరించి ఈ చర్య తీసుకున్నారు. వాణిజ్య, నివాస యూనిట్లతో సహా మొత్తం కాంప్లెక్స్ను 30 రోజుల్లోపు ఖాళీ చేయాలి. అయితే, తొలగింపు నోటీసు చట్టవిరుద్ధం కావచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. సరైన తొలగింపుకు కూల్చివేత అనుమతి, అద్దెదారులకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనుల కోసం, తరలింపు అవసరం లేదని వారువాధిస్తున్నారు.
మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య అథారిటీ ముత్తన్న కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్వహణ, కార్యకలాపాల కోసం నంబర్ 2/2025 కోసం బిడ్లను ఆహ్వానించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









