ముత్తన్న కాంప్లెక్స్ అద్దెదారులకు జూలై 30వరకు గడువు..!!
- July 19, 2025
కువైట్: ముత్తన్న కాంప్లెక్స్ నిర్వహణ సంస్థ పంపిన నోటీసు ప్రకారం..జూలై 30 నాటికి ముత్తన్న కాంప్లెక్స్లోని అందరూ టెనంట్స్ ఖాళీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. లీజుకు తీసుకున్న స్థలాలను అప్పగించాలని సూచించింది. అద్దెదారులు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు.
భాగస్వామ్య చట్టం ప్రకారం ముత్తన్న కాంప్లెక్స్ను బహిరంగ వేలం కోసం ఆమోదించిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల ఉన్నత కమిటీ నిర్ణయాన్ని అనుసరించి ఈ చర్య తీసుకున్నారు. వాణిజ్య, నివాస యూనిట్లతో సహా మొత్తం కాంప్లెక్స్ను 30 రోజుల్లోపు ఖాళీ చేయాలి. అయితే, తొలగింపు నోటీసు చట్టవిరుద్ధం కావచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. సరైన తొలగింపుకు కూల్చివేత అనుమతి, అద్దెదారులకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనుల కోసం, తరలింపు అవసరం లేదని వారువాధిస్తున్నారు.
మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య అథారిటీ ముత్తన్న కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్వహణ, కార్యకలాపాల కోసం నంబర్ 2/2025 కోసం బిడ్లను ఆహ్వానించింది.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







