ముత్తన్న కాంప్లెక్స్ అద్దెదారులకు జూలై 30వరకు గడువు..!!
- July 19, 2025
కువైట్: ముత్తన్న కాంప్లెక్స్ నిర్వహణ సంస్థ పంపిన నోటీసు ప్రకారం..జూలై 30 నాటికి ముత్తన్న కాంప్లెక్స్లోని అందరూ టెనంట్స్ ఖాళీ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. లీజుకు తీసుకున్న స్థలాలను అప్పగించాలని సూచించింది. అద్దెదారులు నిర్వహణ సంస్థతో సమన్వయం చేసుకోవాలన్నారు.
భాగస్వామ్య చట్టం ప్రకారం ముత్తన్న కాంప్లెక్స్ను బహిరంగ వేలం కోసం ఆమోదించిన ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల ఉన్నత కమిటీ నిర్ణయాన్ని అనుసరించి ఈ చర్య తీసుకున్నారు. వాణిజ్య, నివాస యూనిట్లతో సహా మొత్తం కాంప్లెక్స్ను 30 రోజుల్లోపు ఖాళీ చేయాలి. అయితే, తొలగింపు నోటీసు చట్టవిరుద్ధం కావచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. సరైన తొలగింపుకు కూల్చివేత అనుమతి, అద్దెదారులకు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అవసరమని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనుల కోసం, తరలింపు అవసరం లేదని వారువాధిస్తున్నారు.
మరోవైపు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య అథారిటీ ముత్తన్న కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్వహణ, కార్యకలాపాల కోసం నంబర్ 2/2025 కోసం బిడ్లను ఆహ్వానించింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







