ఎలక్ట్రిక్ కేబుల్ పనులు..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- July 24, 2025
మనామా: విద్యుత్, నీటి అథారిటీ ద్వారా విద్యుత్ కేబుల్ల విస్తరణ కోసం రోడ్వర్క్లు జూలై 25న ప్రారంభమవుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రిఫా ప్రాంతంలోని ముష్తాన్ స్ట్రీట్, నూన్ స్ట్రీట్, ఉమ్ అల్-నాసన్ స్ట్రీట్, ముహర్రక్ స్ట్రీట్లలో ఈ పనులు దశలవారీగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఆయా సమయాల్లో ఒక లేన్ లోనే వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ను అనుమతించనున్నారు. ఆగస్టు 31 వరకు పని కొనసాగుతుందని, అప్పటివరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రోడ్డు పనులు జరిగే సమయంలో ప్రతి ఒక్కరి నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







