ఎలక్ట్రిక్ కేబుల్ పనులు..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- July 24, 2025
మనామా: విద్యుత్, నీటి అథారిటీ ద్వారా విద్యుత్ కేబుల్ల విస్తరణ కోసం రోడ్వర్క్లు జూలై 25న ప్రారంభమవుతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో సమన్వయంతో వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రిఫా ప్రాంతంలోని ముష్తాన్ స్ట్రీట్, నూన్ స్ట్రీట్, ఉమ్ అల్-నాసన్ స్ట్రీట్, ముహర్రక్ స్ట్రీట్లలో ఈ పనులు దశలవారీగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఆయా సమయాల్లో ఒక లేన్ లోనే వేర్వేరు సమయాల్లో ట్రాఫిక్ ను అనుమతించనున్నారు. ఆగస్టు 31 వరకు పని కొనసాగుతుందని, అప్పటివరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రోడ్డు పనులు జరిగే సమయంలో ప్రతి ఒక్కరి నిర్దేశిత మార్గదర్శకాలను పాటించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
- వినియోగదారుల రక్షణ కఠినమైన జరిమానాలు..!!
- మే 15 నుండి అబుదాబిలో డెలివరీ మోటార్సైకిళ్లపై నిషేధం..!!
- హంటావైరస్ ప్రమాదం చాలా తక్కువ.. సౌదీ అరేబియా
- వలస కార్మికుల హక్కుల పరిరక్షణకు జాతీయ విధానం..!!
- అమెరికా ఉపాధ్యక్షుడితో ఖతార్ పీఎం భేటీ..!!
- గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల తగ్గింపు..!!
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్









