దుబాయ్ డ్యూటీ ఫ్రీలో భారతీయుడిని వరించిన $1 మిలియన్..!!
- July 24, 2025
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాన్కోర్స్ Bలో బుధవారం జరిగిన తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ మరియు ఫైనెస్ట్ సర్ప్రైజ్ డ్రాలో ఒక భారతీయుడు, ఒక రష్యన్ మిలియనీర్లుగా ఎంపికయ్యారు.
విజేతలలో ఒకరైన, దుబాయ్లో నివసిస్తున్న 42 ఏళ్ల భారతీయుడు సబీష్ పెరోత్.. జూలై 4న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 4296తో మిలీనియం మిలియనీర్ సిరీస్ 508లో $1 మిలియన్ గెలుచుకున్నాడు. దుబాయ్లో పుట్టి పెరిగిన పెరోత్ తన తొమ్మిది మంది భారతీయ సహోద్యోగులతో బహుమతిని పంచుకోనున్నాడు. ఈ బృందం గత ఆరు సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో పాల్గొంటోంది.
ఒక బిడ్డ తండ్రి, GAC గ్రూప్లో సీనియర్ ఆపరేషన్స్ సూపర్వైజర్ అయిన మిస్టర్ పెరోత్.. జీవితాన్ని మార్చే వార్త తెలియగానే ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. “నేను పూర్తిగా షాక్ అయ్యాను. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు. ఇక మీదట మేము ఒక గ్రూపుగా ఖచ్చితంగా పాల్గొంటూనే ఉంటాము.” అని అన్నారు.
కేరళకు చెందిన మిస్టర్ పెరోత్.. 1999లో ప్రారంభమైనప్పటి నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న 254వ భారతీయుడిగా నిలిచారు.
దోహాలో నివసిస్తున్న 57 ఏళ్ల రష్యన్ వ్యక్తి మేన్ సలేహ్.. జూలై 7న ఆన్లైన్లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 1184తో మిలీనియం మిలియనీర్ సిరీస్ 509లో గెలిచారు. 26 సంవత్సరాలుగా దోహాలో నివసిస్తున్న సిరియన్ మూలానికి చెందిన సలేహ్ 15 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్లో పాల్గొంటున్నారు. డాల్ఫిన్ ఎనర్జీలో IT సపోర్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. బహుమతి మొత్తాన్ని తన కొడుకు చదువుతోపాటు సొంతిళ్లు కొనేందుకు వినియోగిస్తానని తెలిపారు. మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న మొదటి రష్యన్ గా సలేహ్ నిలిచారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







