చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్..
- July 24, 2025
భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ అరుదైన ఘనత సాధించింది. ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.సెమీఫైనల్లో 19 ఏళ్ల దివ్య మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ తాన్ జోంగ్యిపై 1.5-0.5 తేడాతో గెలుపొందింది.ఈ ప్రదర్శనతో దివ్య 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. అంతేకాదండోయ్.. తొలి గ్రాండ్మాస్టర్ నార్మ్ను కూడా సాధించింది.
మంగళవారం సెమీస్ తొలి గేమ్ను నల్లపావులతో ఆడిన దివ్య డ్రాగా ముగించింది.బుధవారం రెండో గేమ్లో తెల్లపావులతో ఆడి ప్రత్యర్థిని మట్టి కరిపించింది. తాన్ జోంగ్యి తప్పులను తనకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించింది.
ఇదిలా ఉంటే..మరో సెమీఫైనల్లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చెనాకు చెందిన లీ టింగ్జీతో తలపడింది.వరుసగా రెండు గేమ్లు డ్రాగా ముగిశారు. దీంతో గురువారం వీరిద్దరు టైబ్రేక్స్ గేమ్స్ ఆడతారు.గెలిచిన వారు ఫైనల్కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







