చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్..
- July 24, 2025
భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ అరుదైన ఘనత సాధించింది. ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.సెమీఫైనల్లో 19 ఏళ్ల దివ్య మాజీ ప్రపంచ ఛాంపియన్ తాన్ తాన్ జోంగ్యిపై 1.5-0.5 తేడాతో గెలుపొందింది.ఈ ప్రదర్శనతో దివ్య 2026 మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. అంతేకాదండోయ్.. తొలి గ్రాండ్మాస్టర్ నార్మ్ను కూడా సాధించింది.
మంగళవారం సెమీస్ తొలి గేమ్ను నల్లపావులతో ఆడిన దివ్య డ్రాగా ముగించింది.బుధవారం రెండో గేమ్లో తెల్లపావులతో ఆడి ప్రత్యర్థిని మట్టి కరిపించింది. తాన్ జోంగ్యి తప్పులను తనకు అనుకూలంగా మలుచుకుని విజయం సాధించింది.
ఇదిలా ఉంటే..మరో సెమీఫైనల్లో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చెనాకు చెందిన లీ టింగ్జీతో తలపడింది.వరుసగా రెండు గేమ్లు డ్రాగా ముగిశారు. దీంతో గురువారం వీరిద్దరు టైబ్రేక్స్ గేమ్స్ ఆడతారు.గెలిచిన వారు ఫైనల్కు చేరుకుంటారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









