బహ్రెయిన్ లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!

- July 29, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో రొయ్యలు, చేపల వేటపై నిషేధం ఎత్తివేత..!!

మానామాః రొయ్యలు, చేపల వేటపై కాలానుగుణ నిషేధాన్ని ఆగస్టు 1 నుండి అధికారికంగా ఎత్తివేస్తున్నట్లు బహ్రెయిన్ సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ప్రకటించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ నిషేధం విధించారు.  
సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడటానికి,  ఫిషింగ్ కార్యకలాపాలను నియంత్రించడానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కౌన్సిల్ తెలిపింది. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.  
నిషేధ కాలంలో స్థానిక మత్స్యకారులు అందించిన సహకారాన్ని అధికారులు ప్రశంసించారు.  పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి, బహ్రెయిన్ సముద్ర పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com