ఇద్దరు మృతి.. జైలుశిక్షను పెంచిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 01, 2025
మనామా: ఘోరమైన పడవ ప్రమాదానికి కారణమైన వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ శిక్షను కఠినతరం చేసింది.అతని జైలు శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..ఆ వ్యక్తి, గతంలో దోషిగా నిర్ధారించి, బహిష్కరించబడిన ఇద్దరు విదేశీ సహచరులతో కలిసి అక్రమ చేపల వేటకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.ఆ వ్యక్తి భద్రతా పరికరాలు లేకుండా సముద్రంలోకి తన సొంత పడవను తీసుకొని, నావిగేషన్ లైట్లను ఆపివేసి, కోస్ట్ గార్డ్ గుర్తించకుండా ఉండటానికి పడవ ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసాడు.
మాదకద్రవ్యాల ప్రభావంతో తిరిగి వస్తూ పడవను వేగంగా నడుపుతూ..ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్న మరొక పడవను ఢీకొట్టాడు.దిగువ కోర్టు మొదట్లో ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ ప్రాసిక్యూటర్లు అప్పీల్ చేశారు.అప్పీలేట్ కోర్టు అతని శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం