ఇద్దరు మృతి.. జైలుశిక్షను పెంచిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 01, 2025
మనామా: ఘోరమైన పడవ ప్రమాదానికి కారణమైన వ్యక్తికి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ శిక్షను కఠినతరం చేసింది.అతని జైలు శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం..ఆ వ్యక్తి, గతంలో దోషిగా నిర్ధారించి, బహిష్కరించబడిన ఇద్దరు విదేశీ సహచరులతో కలిసి అక్రమ చేపల వేటకు వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది.ఆ వ్యక్తి భద్రతా పరికరాలు లేకుండా సముద్రంలోకి తన సొంత పడవను తీసుకొని, నావిగేషన్ లైట్లను ఆపివేసి, కోస్ట్ గార్డ్ గుర్తించకుండా ఉండటానికి పడవ ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసాడు.
మాదకద్రవ్యాల ప్రభావంతో తిరిగి వస్తూ పడవను వేగంగా నడుపుతూ..ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్న మరొక పడవను ఢీకొట్టాడు.దిగువ కోర్టు మొదట్లో ఆ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కానీ ప్రాసిక్యూటర్లు అప్పీల్ చేశారు.అప్పీలేట్ కోర్టు అతని శిక్షను మూడు సంవత్సరాలకు పెంచింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









