సౌదీలో 425 మంది ఉద్యోగులపై దర్యాప్తు..142 మంది అరెస్ట్..!!
- August 02, 2025
రియాద్: జూలై నెలలో నమోదైన అవినీతి కేసుల్లో 425 మంది ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక సంస్థ (నజహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో కిందరిని బెయిల్పై విడుదల చేశారు. మొత్తం 2,354 తనిఖీలు నిర్వహించి, అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను విచారించినట్టు నజహా ఒక ప్రకటనలో తెలిపింది.
విచారించిన వారిలో అంతర్గత, రక్షణ, నేషనల్ గార్డ్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం, న్యాయం, మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అవినీతిని ఎదుర్కోవడానికి నజహా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రజా సంస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









