సౌదీలో 425 మంది ఉద్యోగులపై దర్యాప్తు..142 మంది అరెస్ట్..!!
- August 02, 2025
రియాద్: జూలై నెలలో నమోదైన అవినీతి కేసుల్లో 425 మంది ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక సంస్థ (నజహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో కిందరిని బెయిల్పై విడుదల చేశారు. మొత్తం 2,354 తనిఖీలు నిర్వహించి, అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను విచారించినట్టు నజహా ఒక ప్రకటనలో తెలిపింది.
విచారించిన వారిలో అంతర్గత, రక్షణ, నేషనల్ గార్డ్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం, న్యాయం, మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అవినీతిని ఎదుర్కోవడానికి నజహా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రజా సంస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







