సౌదీలో 425 మంది ఉద్యోగులపై దర్యాప్తు..142 మంది అరెస్ట్..!!
- August 02, 2025
రియాద్: జూలై నెలలో నమోదైన అవినీతి కేసుల్లో 425 మంది ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక సంస్థ (నజహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో కిందరిని బెయిల్పై విడుదల చేశారు. మొత్తం 2,354 తనిఖీలు నిర్వహించి, అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను విచారించినట్టు నజహా ఒక ప్రకటనలో తెలిపింది.
విచారించిన వారిలో అంతర్గత, రక్షణ, నేషనల్ గార్డ్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం, న్యాయం, మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అవినీతిని ఎదుర్కోవడానికి నజహా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రజా సంస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









