యూఏఈలో 51.8°Cకి చేరుకున్న ఉష్ణోగ్రతలు..!!
- August 02, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరాయి. తాజాగా 51.8°C ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అల్ ఐన్లోని స్వీహాన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, మే 24న స్వీహాన్లో కూడా 51.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 29 -ఆగస్టు 10 మధ్య వచ్చే అల్ మిర్జామ్ కాలం రాకతో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 10 వరకు, అత్యంత వేడి పరిస్థితులు తీవ్రమైన పొడి గాలులతో కూడి ఉంటాయని వెల్లడించింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తీవ్రమైన వేడి కారణంగా నివాసితులు బయటకు వెళ్లకుండా ఉండాలని, పగటిపూట చల్లని ప్రదేశాలలో ఉండాలని సూచించారు.
మరోవైపు, ఈ వేడి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు.యూఏఈలో 51.8°Cకి చేరుకున్న ఉష్ణోగ్రతలు..!!
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరాయి. తాజాగా 51.8°C ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అల్ ఐన్లోని స్వీహాన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, మే 24న స్వీహాన్లో కూడా 51.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 29 -ఆగస్టు 10 మధ్య వచ్చే అల్ మిర్జామ్ కాలం రాకతో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 10 వరకు, అత్యంత వేడి పరిస్థితులు తీవ్రమైన పొడి గాలులతో కూడి ఉంటాయని వెల్లడించింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తీవ్రమైన వేడి కారణంగా నివాసితులు బయటకు వెళ్లకుండా ఉండాలని, పగటిపూట చల్లని ప్రదేశాలలో ఉండాలని సూచించారు.
మరోవైపు, ఈ వేడి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









