యూఏఈలో 51.8°Cకి చేరుకున్న ఉష్ణోగ్రతలు..!!
- August 02, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరాయి. తాజాగా 51.8°C ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అల్ ఐన్లోని స్వీహాన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, మే 24న స్వీహాన్లో కూడా 51.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 29 -ఆగస్టు 10 మధ్య వచ్చే అల్ మిర్జామ్ కాలం రాకతో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 10 వరకు, అత్యంత వేడి పరిస్థితులు తీవ్రమైన పొడి గాలులతో కూడి ఉంటాయని వెల్లడించింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తీవ్రమైన వేడి కారణంగా నివాసితులు బయటకు వెళ్లకుండా ఉండాలని, పగటిపూట చల్లని ప్రదేశాలలో ఉండాలని సూచించారు.
మరోవైపు, ఈ వేడి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు.యూఏఈలో 51.8°Cకి చేరుకున్న ఉష్ణోగ్రతలు..!!
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఇప్పటివరకు అత్యధిక స్థాయికి చేరాయి. తాజాగా 51.8°C ఉష్ణోగ్రత నమోదైందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. అల్ ఐన్లోని స్వీహాన్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. కాగా, మే 24న స్వీహాన్లో కూడా 51.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
జూలై 29 -ఆగస్టు 10 మధ్య వచ్చే అల్ మిర్జామ్ కాలం రాకతో దేశంలో వాతావరణ పరిస్థితులు మరింత వేడిగా ఉంటాయని భావిస్తున్నారు. ఆగస్టు 10 వరకు, అత్యంత వేడి పరిస్థితులు తీవ్రమైన పొడి గాలులతో కూడి ఉంటాయని వెల్లడించింది. ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు తీవ్రమైన వేడి కారణంగా నివాసితులు బయటకు వెళ్లకుండా ఉండాలని, పగటిపూట చల్లని ప్రదేశాలలో ఉండాలని సూచించారు.
మరోవైపు, ఈ వేడి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, బలమైన గాలులు వీచాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







