కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ, ట్రాఫిక్ క్యాంపెయిన్..పలువురు అరెస్ట్..!!
- August 02, 2025
కువైట్: మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ, ట్రాఫిక్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తనిఖీల సందర్భంగా వాంటెడ్ వ్యక్తులు, ట్రాఫిక్-రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించేవారిని పట్టుకోవడం లక్ష్యమన్నారు.వివిధ డిపార్టుమెంట్ల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ తనిఖీలు సందర్భంగా, 934 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే, రెసిడెన్సీ-కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 13 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. గుర్తింపు పత్రాలు లేని ఆరుగురిని, 9 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అనుమానిత మాదకద్రవ్యాలు, మద్యం కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహకరించాలని, అన్ని ప్రాంతాలలో ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







