కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ, ట్రాఫిక్ క్యాంపెయిన్..పలువురు అరెస్ట్..!!
- August 02, 2025
కువైట్: మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ఆదేశాల మేరకు కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ, ట్రాఫిక్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తనిఖీల సందర్భంగా వాంటెడ్ వ్యక్తులు, ట్రాఫిక్-రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించేవారిని పట్టుకోవడం లక్ష్యమన్నారు.వివిధ డిపార్టుమెంట్ల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ తనిఖీలు సందర్భంగా, 934 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే, రెసిడెన్సీ-కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 13 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. గుర్తింపు పత్రాలు లేని ఆరుగురిని, 9 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అనుమానిత మాదకద్రవ్యాలు, మద్యం కలిగి ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహకరించాలని, అన్ని ప్రాంతాలలో ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







