సెమీస్ కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, తరుణ్..
- August 02, 2025
మకావ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, తరుణ్ మన్నేపల్లి సెమీఫైనల్స్ చేరగా, డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించింది.
- కామన్వెల్త్ గేమ్స్ విజేత లక్ష్య సేన్ ఈ సంవత్సరంలో తొలిసారి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్కు అర్హత సాధించాడు.చైనాకు చెందిన జూ షుయాన్ చెన్ను 21-14, 18-21, 21-14 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ సుమారు ఒక గంట మూడు నిమిషాల పాటు సాగింది.
- తరుణ్ మన్నేపల్లి కూడా అద్భుత ప్రదర్శనతో తన తొలి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. చైనా ఆటగాడు హూ జె అన్నపై 21-12, 13-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. ఈ పోరు ఒక గంట 15 నిమిషాల పాటు జరిగింది.
- సెమీ ఫైనల్స్లో లక్ష్య సేన్ ఇండోనేషియా క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్ను, తరుణ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోను ఎదుర్కొనబోతున్నారు.
- మరోవైపు, ప్రపంచ మాజీ నంబర్ వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. మలేషియా జంట చూం హాన్ జియాన్–ముహమ్మద్ హైకల్ చేతిలో 14-21, 21-13, 22-20 తేడాతో ఓటమి చవిచూశారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!