స్కామ్ అలెర్ట్.. సోషల్ మీడియా 'డిస్కౌంట్'లపై జాగ్రత్త..!!
- August 08, 2025
దుబాయ్: దుబాయ్లో ట్రాఫిక్ జరిమానాల పై నకిలీ డిస్కౌంట్లకు సంబంధించిన ఇటీవలి స్కామ్ బయటపడిన నేపథ్యంలో దుబాయ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ సేవలకు సంబంధించిన అనధికారిక ఆఫర్ల పట్ల, ముఖ్యంగా సోషల్ మీడియా మరియు మెసేజింగ్ యాప్ల ద్వారా ప్రచారంలో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వచ్చ ఆఫర్లు, డిస్కౌంట్లు ఒక ట్రాప్ అని డిజిటల్ రిస్క్ అడ్వైజర్ లీలా మన్సూర్ అన్నారు. ట్రాఫిక్ జరిమానాలు, వీసా ఖర్చులు లేదా సర్వీస్ ఫీజులను తగ్గిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తారని తెలిపారు.
అధికారికంగా కనిపించే లోగోలు, అత్యవసర మెసేజులు, వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి ప్రైవేట్ ఛానెల్లను ఉపయోగించి జరిగే స్కామ్లు పెరుగుతున్నాయని యూఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు ఒమర్ ఖద్దూర్ హెచ్చరించారు. ఏదైనా చెల్లింపుల కోసం యూఏఈ పాస్, అధికార యాప్లు లేదా ధృవీకరించబడిన వెబ్సైట్ల వంటి అధికారిక పోర్టల్లపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్