ఒమన్ లో ముందస్తు రెటినోపతి స్క్రీనింగ్ ప్రోగ్రామ్..!!
- August 14, 2025
మస్కట్: ఒమన్ లో కృత్రిమ మేధస్సు టెక్నాలజీలను ఉపయోగించి డయాబెటిక్ రెటినోపతిని ముందస్తుగా గుర్తించే జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. AI-ఆధారిత జాతీయ స్క్రీనింగ్ కార్యక్రమం ఒమన్ వ్యాప్తంగా 25 ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉందని ఆపరేషనల్ డైరెక్టర్ డాక్టర్ మాజిద్ సలీం అల్ షైబానీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పరిక్షించిన వారిలో దాదాపు 30శాతం మందిలో డయాబెటిక్ రెటినోపతి ముందస్తు లక్షణాలను గుర్తించినట్లు తెలిపారు.
కాగా, డయాబెటిక్ రెటినోపతి నిశ్శబ్ద వ్యాధి అని, తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుందని డాక్టర్ అల్ షైబానీ వివరించారు. ముందస్తుగా గుర్తించడం వలన లేజర్ చికిత్స లేదా ఇంట్రాకోక్యులర్ ఇంజెక్షన్ల ద్వారా నివారించడం సాధ్యమవుతుందన్నారు. సకాలంలో చికిత్స అందించకపోతే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం అన్ని టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ రోగులను కవర్ చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







