ఒమన్ లో ముందస్తు రెటినోపతి స్క్రీనింగ్ ప్రోగ్రామ్..!!
- August 14, 2025
మస్కట్: ఒమన్ లో కృత్రిమ మేధస్సు టెక్నాలజీలను ఉపయోగించి డయాబెటిక్ రెటినోపతిని ముందస్తుగా గుర్తించే జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 10వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. AI-ఆధారిత జాతీయ స్క్రీనింగ్ కార్యక్రమం ఒమన్ వ్యాప్తంగా 25 ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉందని ఆపరేషనల్ డైరెక్టర్ డాక్టర్ మాజిద్ సలీం అల్ షైబానీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పరిక్షించిన వారిలో దాదాపు 30శాతం మందిలో డయాబెటిక్ రెటినోపతి ముందస్తు లక్షణాలను గుర్తించినట్లు తెలిపారు.
కాగా, డయాబెటిక్ రెటినోపతి నిశ్శబ్ద వ్యాధి అని, తరచుగా తీవ్రమైన సమస్యలు తలెత్తిన తర్వాత మాత్రమే నిర్ధారణ అవుతుందని డాక్టర్ అల్ షైబానీ వివరించారు. ముందస్తుగా గుర్తించడం వలన లేజర్ చికిత్స లేదా ఇంట్రాకోక్యులర్ ఇంజెక్షన్ల ద్వారా నివారించడం సాధ్యమవుతుందన్నారు. సకాలంలో చికిత్స అందించకపోతే శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం అన్ని టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ రోగులను కవర్ చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









