కొన్ని CBSE పాఠశాలల్లో త్వరలో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్..!!
- August 14, 2025
యూఏఈ: యూఏఈలోని విద్యార్థులు ఓపెన్-బుక్ అసెస్మెంట్స్ (OBAs) కోసం సిద్ధమవుతున్నారు. కొన్ని CBSE-అనుబంధ పాఠశాలలు ఈ కొత్త రకాల పరీక్షలను నావిగేట్ చేయడానికి టీచర్లకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతికి OBAలను ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. అయితే, ఫ్రేమ్వర్క్ను అనుసరించమని పాఠశాలలకు చెప్పినప్పటికీ, అమలును వారి ఇష్టానికి వదిలేశారు.
ఈ కొత్త విధానం బట్టీ పట్టడం నుండి కొత్త లెర్నింగ్ మెథడ్స్ కు మారవలసిన అవసరాన్ని చెబుతుందని అబుదాబిలోని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ తెలిపారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకపోతే సమాధానాలు గుర్తించడం అంత సులభం కాదన్నారు.
CBSE గతంలో ఓపెన్-బుక్ అసెస్మెంట్లను అమలు చేసింది. 2014లో 9వ తరగతి విధ్యార్థులకు ప్రయోగాత్మకంగా ఓపెన్ టెక్స్ట్ బేస్డ్ అసెస్మెంట్ ను ప్రారంభించింది. అయితే, మిశ్రమ ఫలితాలు, టీచర్లలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో 2017–18 విద్యా సంవత్సరంలో దీనిని నిలిపివేశారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









