కొన్ని CBSE పాఠశాలల్లో త్వరలో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్..!!
- August 14, 2025
యూఏఈ: యూఏఈలోని విద్యార్థులు ఓపెన్-బుక్ అసెస్మెంట్స్ (OBAs) కోసం సిద్ధమవుతున్నారు. కొన్ని CBSE-అనుబంధ పాఠశాలలు ఈ కొత్త రకాల పరీక్షలను నావిగేట్ చేయడానికి టీచర్లకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతికి OBAలను ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. అయితే, ఫ్రేమ్వర్క్ను అనుసరించమని పాఠశాలలకు చెప్పినప్పటికీ, అమలును వారి ఇష్టానికి వదిలేశారు.
ఈ కొత్త విధానం బట్టీ పట్టడం నుండి కొత్త లెర్నింగ్ మెథడ్స్ కు మారవలసిన అవసరాన్ని చెబుతుందని అబుదాబిలోని షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాషా సింగ్ తెలిపారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకపోతే సమాధానాలు గుర్తించడం అంత సులభం కాదన్నారు.
CBSE గతంలో ఓపెన్-బుక్ అసెస్మెంట్లను అమలు చేసింది. 2014లో 9వ తరగతి విధ్యార్థులకు ప్రయోగాత్మకంగా ఓపెన్ టెక్స్ట్ బేస్డ్ అసెస్మెంట్ ను ప్రారంభించింది. అయితే, మిశ్రమ ఫలితాలు, టీచర్లలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో 2017–18 విద్యా సంవత్సరంలో దీనిని నిలిపివేశారు.
తాజా వార్తలు
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం







