బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!

- August 16, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!

మనామా: బహ్రెయిన్‌ వ్యాప్తంగా భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాయబార కార్యాలయంలో రాయబారి వినోద్ కె. జాకబ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  బహ్రెయిన్ మలయాళీ బిజినెస్ ఫోరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. 11వ వార్షిక ‘హెల్ప్ & డ్రింక్ 2025’ కార్యక్రమంలో భాగంగా తుబ్లిలోని అల్ రషీద్ లేబర్ క్యాంప్‌లో వేడుకలు నిర్వహించారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన త్రివర్ణ నేపథ్య ఐస్ క్రీం, ఎనర్జీ డ్రింక్స్ ను అందించారు.  

అల్బా ప్రాంతంలో ఉన్న లేబర్ క్యాంప్‌లో అన్నై తమిళ్ మండ్రం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. 100 మందికి పైగా కార్మికులకు ఆహారం, పండ్లు మరియు కూల్ డ్రింక్స్ అందించారు.   

బహ్రెయిన్‌లోని సెయింట్ పీటర్స్ జాకోబైట్ సిరియన్ చర్చి చర్చి ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో పాదర్ వట్టవేలిల్ జాతీయ జెండాను ఎగురవేశారు.   ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ ఇసా టౌన్ క్యాంపస్‌లో భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ISB చైర్మన్ అడ్వకేట్ బిను మన్నిల్ వరుగీస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.   

బహ్రెయిన్ కేరళ కాథలిక్ అసోసియేషన్ తన ప్రాంగణంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అసోసియేషన్ అధ్యక్షుడు జేమ్స్ జాన్ జాతీయ జెండాను ఎగురవేయడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.   కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ మనామలోని దాని ప్రధాన కార్యాలయంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో KMCC బహ్రెయిన్ జనరల్ సెక్రటరీ షంసుద్దీన్ వెల్లికులంగర జాతీయ జెండాను ఎగురవేశారు.

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బహ్రెయిన్ కేరళీయ సమాజం తన కార్యాలయ ప్రాంగణంలో జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. కేరళీయ సమాజం తాత్కాలిక అధ్యక్షుడు దిలీష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com