బ్యాక్ టు స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖతార్ రైల్..!!

- August 18, 2025 , by Maagulf
బ్యాక్ టు స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖతార్ రైల్..!!
దోహా: దోహా మెట్రోలోని స్పోర్ట్ సిటీ స్టేషన్‌లో 'బ్యాక్ టు స్కూల్' కార్యక్రమం రెండవ ఎడిషన్‌ను ప్రారంభించనున్నట్టు ఖతార్ రైల్వేస్ కంపెనీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 2 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. 'మెట్రో ఈవెంట్స్' సిరీస్‌లో ఈ కార్యక్రమం భాగమని, దీనిని ఏడాది పొడవునా మెట్రో స్టేషన్లలో ప్రజల కోసం నిర్వహిస్తామని ఖతార్ రైల్ తెలిపింది.
మెట్రో స్టేషన్లను  అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీలుగా మార్చడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.  
మెట్రో గోల్డ్ లైన్‌లోని స్పోర్ట్ సిటీ స్టేషన్‌లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, పుస్తక దుకాణాలు మరియు రిటైలర్ల నుండి ప్రత్యేకమైన ఆఫర్‌లను పొందే అవకాశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం వారపు రోజులలో సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు మరియు వారాంతాల్లో సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు ఉంటుంది.  
ఇక పిల్లలు, ఫ్యామిలీ కోసం ఇంటరాక్టివ్ గేమింగ్ జోన్, పెయింటింగ్, కలరింగ్ మరియు ఆర్ట్ పోటీలు ఉంటాయని, గెలుపొందిన వారు విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి.
ఈ కార్యక్రమం సందర్భంగా ఖతార్ రైల్ కొత్త 365-రోజుల మెట్రోపాస్‌ను ప్రకటించింది. 990 ఖతారి రియాల్స్ ధర గల వార్షిక పాస్ తో  దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్‌వర్క్‌లలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.  
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com